విజయనగరం :2004 సెప్టెంబర్ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ సీపీఎస్ విధానం ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ విధానం ద్వారా పది శాతం బేసిక్ మరియు డీఏలతో పాటు ప్రభుత్వం ఇస్తున్న మ్యాచింగ్ గ్రాంట్ను కూడా ఆ ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ అకౌంట్కు ఎలాంటి భద్రత లేదు. షేర్ మార్కెట్ షరతులకు లోబడి ఈ ఖాతా నిర్వహణ జరుగుతుంది. ఈ విధంగా ప్రతీ ఏడాది ఎన్ఎస్డీఎల్కు సుమారు 800 కోట్లకు పైగా మ్యాచింగ్ గ్రాంట్ వేస్తున్నారు. ఈ విధానం ఇటు ఉద్యోగికి, అటు ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం, కార్పొరేట్ శక్తులకు ధారబోసే విధంగా ఉంది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగ ఉపాధ్యాయులకు భద్రతను కల్పించాలి. –ఎం.సీతన్న, నిమ్మక మాధవరావు, ఆర్.రమేష్, పత్తిక చంద్రమోహన్, సీపీఎస్ ఉద్యోగులు