మేం తలచుకుంటే తెలంగాణలో అడుగుపెట్టలేరు: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

11 Sep, 2013 04:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నేతల సహకారం వల్లే ఏపీఎన్జీవోల సంఘం హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిం చగలిగిందని, అదే తెలంగాణవాదులు తలచుకుంటే ఇక్కడ అడుగుకూడా పెట్టేవారుకాదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మంగళవారమిక్కడ మీడియాతో వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తే.. ఆ తరువాత ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రులకు సహకరిస్తామని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం వస్తే సీఎం సహా ఎవరైనా హైకమాండ్ చెప్పినట్లు వినాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు