అత్యాచారం.. హత్య.. ఆపై దహనం?

6 Aug, 2015 02:49 IST|Sakshi
- దివ్యశ్రీ (ఫైల్)

గొలుగొండ: విశాఖ జిల్లా గొలుగొండ మండలం పుత్తడిగైరంపెట పంచాయతీ శివారులోని అప్పన్నపాలెంలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు.. సురాడ తాతారావు భార్య మంజుల, ముగ్గురు పిల్లలతో త మ జీడిమామిడి తోటలో నివాసం ఉంటున్నారు. చిన్న కుమార్తె, కుమారుడు ఇతర ప్రాంతాలల్లో చదువుకుంటున్నారు. పెద్ద కుమార్తె సూరాడ దివ్యశ్రీ(18) నర్సీపట్నంలోని ప్రైవేట్ కాళాశాలలో ఇంటర్ మొదటి ఏడాది(బైపీసీ) చదువుతోంది. తండ్రి తాతారావు ఆటో నడుపుతుండగా, తల్లి మంజుల నర్సీపట్నంలో ఒక దుస్తుల షాపులో పని చేస్తోంది. దివ్యశ్రీతోపాటు తల్లి, తండ్రి రోజు ఉదయం నర్సీపట్నం వెళుతుంటారు.

అనారోగ్యం కారణంగా దివ్యశ్రీ మంగళవారం కళాశాలకు వెళ్లలేదు. తండ్రి, తల్లి వారి పనులకు వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు కూతురు శవం కాలుతూ కనిపిం చింది. మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. యువతి కాలిన విధానం చూస్తే ఎవరో అత్యాచారం అనంతరం హత్యచేసి, ఇంటి ఆవరణ వద్దకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చి ఉంటారని స్థానికులతో పాటు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.

దివ్యశ్రీ కాలిపోయేటప్పుడు కదలకుండా ఒకే చోట ఉండటం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. తమ కుమార్తెకు ఆత్మహత్య చేసుకొనేటంత కష్టాలు లేవని తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన న ర్సీపట్నం రూరల్ సీఐ గపూర్, గొలుగొండ ఎస్సై జోగారావు అనుమానాస్పద మృతిగా కేసు నమేదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు