హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలందరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానుకలు ఇవ్వనుంది. కానుకలంటే అలాంటి ఇలాంటి కానుకలు కాదు, ఈ మధ్యే మార్కెట్లో హల్చల్ చేస్తున్న యాపిల్ ఐఫోన్-6లను ఎమ్మెల్యేలకు కానుకగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కానుకుగా ఇవ్వనున్న ఒక్కో ఐఫోన్ ధర సుమారు రూ.50 వేలు. రాష్ట్రం ఆర్థికపరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనీ, ఆర్థిక పురోగతి సాధించాల్సిన అవసరం ఉందనీ.. ఓ వైపు ఊదరగొడుతున్న చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇంత విలువైన కానుకలు ఇవ్వాల్సిన అవసరం ఏంటని పలువురు వాపోతున్నారు.