ఆర్టీసీ అద్దెబస్సులో చెలరేగిన మంటలు

26 Nov, 2013 06:42 IST|Sakshi

కరీంనగర్: జిల్లాలోని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో  సోమవారం రాత్రి ఆర్టీసీ అద్దె బస్సులో  అగ్నిప్రమాదం సంభవించింది.  బస్సులో డీజిల్ ట్యాంకు లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 

దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ భయాందోళనలకు గురైయ్యారు. ఈ ఘటనలో  ఆర్టీసీ బస్సు పాక్షికంగా ధ్వంసం కావడంతో  పెనుప్రమాదం తప్పింది.
 

మరిన్ని వార్తలు