రేపు అర్ధరాత్రి నుంచి ఆర్టీసి ఛార్జీల పెంపు

4 Nov, 2013 18:27 IST|Sakshi
రేపు అర్ధరాత్రి నుంచి ఆర్టీసి ఛార్జీల పెంపు

హైదరాబాద్: రేపు అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బస్ ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్టీసి ఛార్జీల పెంపు ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతకం చేశారు. ఏసీ బస్సు సర్వీసులకు 12 శాతం, లగ్జరీ సర్వీసులకు 10 శాతం,  ఆర్డినరీ, పల్లెవెలుగు సర్వీసులకు 8 శాతం చొప్పున ఛార్జీలు పెంచారు. ఛార్జీలు పెంపు వల్ల ప్రయాణికులపై 600 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గ్యాస్ ధర పెంచేశారు. ఉల్లిపాయల ధర రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ఈ పరిస్థితులలో మళ్లీ ఆర్టీసి బస్సు ఛార్జీలు పెంచారు.

 

>
మరిన్ని వార్తలు