పూజారి ఫైట్

23 Mar, 2015 20:00 IST|Sakshi
పూజారి ఫైట్

తూర్పుగోదావరి(పిఠాపురం): ప్రభుత్వం తనను ఆదుకోవాలని, తన సమస్యలను పట్టించుకోవాలని ఓ అర్చకుడు దీక్షకు దిగారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండల కేంద్రంలో ఉన్న మహారాణి ఆలయంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... పిఠాపురం మండలానికి చెందిన యడవెల్లి కిరణ్‌కుమార్ అనే వ్యక్తి మహారాణి దేవాలయంలో అర్చకుడిగా పని చేస్తున్నారు.

అయితే  దేవాలయంలో పని చేయడం వల్ల తనకు జీవనోపాధి కష్టంగా ఉందని, ప్రభుత్వం ఆదుకోవడంలేదని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టినా అవేవీ తమకు అందడంలేదని వాపోయాడు. అందుకే దీక్షకు దిగుతున్నానని, తన గోడు వినడానికి దేవాదాయశాఖ మంత్రి వచ్చేదాకా దీక్ష విరమించేదిలేదని తెగేసి చెప్పారు.

మరిన్ని వార్తలు