మాడుగుల: విశాఖ జిల్లా మాడుగుల మండలం ఉర్లోవకొండ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన పురావస్తు తవ్వకాలు శనివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. పది మంది సభ్యుల బృందం ఈ తవ్వకాలలో పాలుపంచుకుంటోంది. ఎందుకోసం ఈ తవ్వకాలన్న విషయమై సమాచారం బయటకు రాలేదు. ఖనిజాల కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.