నిలిచిన ఆర్మీజవాన్ అప్పలరాజు అంత్యక్రియలు

4 Nov, 2014 11:19 IST|Sakshi

విశాఖ : ఆర్మీ జవాన్ అప్పలరాజు అంత్యక్రియలు విశాఖ వేపగుంట శ్మశాన వాటికలో మంగళవారం నిలిపిపోయాయి. అధికార లాంఛనాల కార్యక్రమానికి ఆర్మీ అధికారులు ఎవరూ రాకపోవటంపై బంధువులు ఆందోళనకు దిగారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని వారు నిలిపివేశారు. 14 ఏళ్ల పాటు కుటుంబాన్ని వదిలి దేశసేవకు అంకితమైన ఆర్మీ జవాన్కు ఇచ్చే గౌరవం ఇదా? అంటూ అప్పల రాజు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మోహదీపట్నం ఆర్మీ క్యాంపస్లో సోమవారం తెల్లవారుజామున అప్పలరాజు పిస్టోలుతో కాల్చుకుని మరణించిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు