భీమిలి మండలం చిప్పాడలో దివీస్ ల్యాబ్ విస్తరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దివీస్ ల్యాబ్ విస్తరణ వ్యతిరేక కమిటీ నేడు నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మాజీ సైనికులను సోమవారం తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకు నిరసనగా చిట్టినగర్ వద్ద ఉద్యమకారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.