తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అశోక్ లేలాండ్ కంపెనీ యాజమాన్యం లారీని బహూకరించింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కే దాసరి శనివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం ఎదుట లారీకి పూజలు నిర్వహించారు. లారీకి సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుకు అందజేశారు. వాహనం విలువ రూ.18.88 లక్షలుగా వినోద్ కే దాసరి పేర్కొన్నారు.