పీఎస్లో ఏఎస్ఐ మృతి

24 Dec, 2014 08:26 IST|Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లా పరిగి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐ శ్రీరాములు గుండెపోటుతో మృతి చెందారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయనకు గత అర్థరాత్రి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. దాంతో పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి... ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. శ్రీరాములు మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. దీంతో శ్రీరాములు మృతదేహన్ని ఆయన నివాసానికి తరలించారు. శ్రీరాములు మృతి పట్ల ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోకనాథ్ సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు