'అసోం’ కార్మికుడి హత్య

29 May, 2015 08:32 IST|Sakshi

గుడిపాల: చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పెద్దదలువాపల్లి గ్రామ సమీపంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని గుట్ట ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు అసోం రాష్ట్రానికి చెందిన వాసన్‌అలీ (22) గా గుర్తించారు. అక్కడి గ్రానైట్ పరిశ్రమలో అసోం రాష్ట్రానికి చెందిన పది మంది కార్మికులుగా పనిచేస్తున్నారని.. వారి మధ్య వివాదం తలెత్తి హత్యకు దారితీసి ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు