మరో 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు

29 Nov, 2017 02:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు మరో మూడు రోజుల పాటు నిర్వహించ నున్నట్లు మంత్రి కాల్వ∙శ్రీనివాసులు వెల్లడించారు. శాసనసభాపతి కోడెల శివ ప్రసాదరావు అధ్యక్షతన శాసనసభలోను, మండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ అధ్యక్ష తన శాసన మండలిలోను మంగళవారం జరిగిన బీఏసీ సమావేశం నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ నెల 29, 30 తేదీల్లోను, వచ్చే నెల 2న సభలో చర్చించాల్సిన అంశాలను నిర్ణయించినట్టు వివరించారు. 

>
మరిన్ని వార్తలు