విద్యుదాఘాతంతో లైన్‌మెన్ దుర్మరణం

24 May, 2015 10:39 IST|Sakshi

కొడవలూరు : నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం మానేగుంటపాడు గ్రామంలో విద్యుదాఘాతంలో అసిస్టెంట్ లైన్‌మెన్ మృత్యువాత పడ్డాడు. వివరాల ప్రకారం...  అసిస్టెంట్ లైన్‌మెన్ వగ్గాల ప్రతాప్(28)  ఆదివారం మానేగుంటపాడు గ్రామంలోని పొలాల్లో విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా కావడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

మరిన్ని వార్తలు