ఉద్యోగిపై దాడి.. టీడీపీ నేతపై కేసు నమోదు

2 Jul, 2015 16:03 IST|Sakshi

శ్రీకాకుళం : ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పై దాడి చేసిన టీడీపీ నేత కందాపు వెంకటరమణపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పై దాడిచేశారని, వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బాధిత ఉద్యోగి నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు, ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు