బీసీ బిల్లుకు 19న పార్లమెంటు ముట్టడి

5 Aug, 2013 03:21 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోరుతూ ఈ నెల 19న పార్లమెంటును ముట్టడించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం తెలిపింది. అలాగే బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, రాజ్యాధికారంలో వాటా కల్పించాలని కోరుతూ ఈ నెల 22న ఢిల్లీలో రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
మరిన్ని వార్తలు