పశువైద్యాధికారికి బదులుగా...

3 Nov, 2017 11:55 IST|Sakshi
పశువైద్యం చేస్తున్న సింహాచలం(ఓఎస్‌ లక్ష్మి భర్త)

ఇక్కడ పశువుకు వైద్యం చేస్తున్న వ్యక్తి పశువైద్యుడని అనుకుంటే పొరపాటు పడినట్టే. ఈయన కనీసం ఆస్పత్రిలో ఉద్యోగి కూడా కాదు. కానీ అక్కడి ఆఫీస్‌ సబార్డినేట్‌(అటెండర్‌) భర్త. ఇలా నేరుగా చికిత్సలు చేసేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడమే ఇక్కడి విశేషం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడ గ్రామీణ పశువైద్యకేంద్రంలో అటెండర్‌గా కాంట్రాక్ట్‌ పద్ధతిలో మరడాన లక్ష్మి పనిచేస్తున్నారు. కానీ ఆమెకు బదులుగా భర్త సింహాచలం హాజరై ఇలా చికిత్సలు చేసేస్తుంటారు.

ఇక్కడ ఓ లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ ఉన్నా ఆయన ఇదేమీ పట్టించుకోవడం లేదు. దీనిపై పాత్రికేయులు ఆయన్ను ప్రశ్నిస్తే ఆయనకు అన్నీ తెలుసు. అందుకే మేమేం అడ్డుచెప్పట్లేదు. అంటూ తప్పించుకున్నారు. కాగా ఆయనా సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని స్థానికులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు