అభినందించిన పోలీసులు
పశ్చిమగోదావరి , ఏలూరు టౌన్: ఏలూరులో ఒక శుభకార్యానికి వచ్చి తన విలువైన బ్యాగును ఒక వ్యక్తి పోగొట్టుకోగా...ఆటో డ్రైవర్ తన నిజాయితీతో ఆ బ్యాగును ఏలూరు టూటౌన్ పోలీసులకు అందజేశాడు. పోలీసులు బ్యాగును బాధితుడికి అందజేసి, ఆటోడ్రైవర్ గొప్పతనాన్ని అభినందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చెందిన హేమంత్ కిరణ్కుమార్ ఏలూరులో ఒక శుభకార్యానికి బం«ధువులతో కలిసి వచ్చాడు. స్థానిక ఫైర్స్టేషన్ సెంటర్ జేకే ప్యాలెస్ సమీపంలోని శ్రీకృష్ణా లాడ్జిలో ఉండేందుకు వెళుతూ ఆటోలో తన బ్యాగును మరిచిపోయి వెళ్లిపోయారు. అనంతరం వంగాయగూడెం ఆటోస్టాండ్కు చెందిన ఆటోడ్రైవర్ రాజు ఆ బ్యాగును గమనించి ఏలూరు టూటౌన్ పోలీసులకు అప్పగించాడు. ఆ బ్యాగులో 8 ఉంగరాలు, నగదు, విలువైన డాక్యుమెంట్లు, బట్టలు ఉన్నాయి. బ్యాగులో లభించిన వివరాల మేరకు హేమంత్ కిరణ్కుమార్కు సమాచారం అందించిన ఏలూరు టూటౌన్ ఎస్సై కె.రామారావు అతడికి బ్యాగును అందజేశారు. విలువైన ఉంగరాలు, నగదు, డాక్యుమెంట్లు ఉన్నా నిజాయితీతో అందజేసిన ఆటోడ్రైవర్ రాజును పోలీ సులు, హేమంత్కిరణ్కుమార్ అభినందించారు.