ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి

11 Oct, 2015 09:34 IST|Sakshi

పాల్వంచ (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా పాల్వంచలో ఆటో డ్రైవర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. వివరాల ప్రకారం... పాల్వంచ పట్టణంలోని నెహ్రూనగర్ వికలాంగుల కాలనీలో భాస్కర్(44) అనే ఆటో డ్రైవర్ నివాసముంటున్నాడు. కాగా కాలనీకి సమీపంలో రాతిచెరువు వద్ద ఆదివారం ఉదయం భాస్కర్ మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు.

అతని శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయి. గొంతుపై కత్తి గాట్లు ఉండడంతో ఎవరో హతమార్చి పడేశారని భావిస్తున్నారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు