ఆటోలో వ్యక్తి సజీవదహనం

15 Apr, 2017 11:00 IST|Sakshi
నెల్లూరు:  జిల్లాలోని దగదర్తి మండలం కౌరుగుంట వద్ద ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. గ్రామ శివారులోని ఓ ఆటోలో గుర్తుతెలియని వ్యక్తిని సజీవదహనం చేశారు. ఆటోలో కాలిన మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
మరిన్ని వార్తలు