బీ ఫార్మసీ విద్యార్థిపై ర్యాగింగ్‌: ఆత్మహత్యాయత్నం

9 Feb, 2014 14:06 IST|Sakshi

హైదరాబాద్: ర్యాగింగ్ భూతాలు సాటి విద్యార్థుల పట్ల పెను శాపంగా మారుతున్నాయి. వీటిపై ఇప్పటికే నిషేధం ఉన్నా కొంతమంది ఆకతాయిలు తమ పంథాను మాత్రం వీడటం లేదు. వీరు చేసే వికృత చేష్టలకు అమాయక విద్యార్థులకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటువంటి ఘటనే నగరంలోని మల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో చోటు చేసుకుంది.

 

బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న శ్రవణ్ అనే విద్యార్థిపై సీనియర్లు అతి క్రూరంగా ర్యాగింగ్ పాల్పడ్డారు. దీంతో కలత చెందిన ఆ విద్యార్థి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కళాశాల యాజమాన్యాన్ని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు