కారు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం

7 Feb, 2016 18:33 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. చుండుపల్లి మండలం కుప్పగుట్టకు చెందిన గోపీనాయక్ తిరుపతిలో బీటెక్ చదువుతున్నాడు.

ఆదివారం కావడంతో బైక్పై ఇంటికి వస్తున్న క్రమంలో చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోపినాయక్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు