ఓడీ చెరువు : అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నాహజారే అంతటి వాడిని అని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి విమర్శించారు. శనివారం ఓడీ చెరువు మండలం సున్నంపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుకు రాష్ట్ర ప్రజానీకమే కాక యావత్ దేశం తల దించుకునేలా ఉందన్నారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఆ నిధులను రాయలసీమలోని హంద్రీనీవా పనులకు వినియోగించి ఉంటే రాయలసీమ చెరువులు జలకళతో ఉండేవన్నారు. లేపాక్షి , హిందూపురం, చిలమత్తూరు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృధ్ది కేంద్రాలు స్థాపిస్తామని చెప్పి ఏడాది అయినా ఒక్కటీ చేయలేదన్నారు.