అమ్మా.. నేనేమి చేశాను పాపం!

13 Jul, 2019 06:36 IST|Sakshi

సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : ఆ తల్లి నవమాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అవయవాలు సక్రమంగా లేవని, ఆ బిడ్డ లోకాన్ని చూడకముందే చిదిమేసింది. శుక్రవారం మండలంలోని బంటుపల్లి గ్రామంలో చెత్తకుప్పలో ఆడబిడ్డ విగతజీవిగా కనపడటం కలకలం రేపింది. దీన్ని చూసిన వారంతా అయ్యో పాపం అని వేదన పడ్డారు. గ్రామంలో ఇటీవల గర్భిణులుగా ఎవరు ఉన్నారని ఆరా తీయగా, వారిలో ఓ గర్భిణి ఇలా పడేసినట్లు తెలిసింది. గ్రామపెద్దల వరకు విషయం చేరడంతో మందలించారు. దహన కార్యక్రమాలు చేయాలని పలువురు సూచించడంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ శిశువును శ్మశానంలో పాతిపెట్టారు. 

మరిన్ని వార్తలు