కదిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం

12 Dec, 2016 15:16 IST|Sakshi
కదిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం

కదిరి: అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాకు చేదు అనుభవం ఎదురైంది. నల్లచెరువు మండలం గోరంట్లవారిపల్లిలో టీడీపీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు ఆయన శనివారం వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ను పార్టీ నుంచి దూరం చేస్తున్నారంటూ ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీకి దిగాయి. చివరకు పోలీసు భద్రత నడుమ చాంద్‌బాషా గ్రామంలోకి వెళ్లి జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు