తేనెటీగల దాడిలో పది మందికి గాయాలు

13 May, 2015 16:15 IST|Sakshi
తేనెటీగల దాడిలో పది మందికి గాయాలు

సూళ్లూరుపేట (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు): సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో వద్ద బుధవారం ఉదయం ధర్నా చేస్తున్న కార్మికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా తేనెటీగలు ముసురు కోవటంతో కార్మికులు  పరుగులు తీశారు. ఈ దాడిలో పది మంది గాయాలపాలయ్యారు. అటువైపు వెళ్తున్న వారిపై తేనెటీగలు దాడి చేస్తున్నాయి. దీంతో డిపో వైపు వెళ్లటానికి ఎవరూ సాహసించటం లేదు.

>
మరిన్ని వార్తలు