పాఠశాల విద్యార్థులపై తేనెటీగల దాడి

25 Feb, 2016 11:36 IST|Sakshi
నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు శివారులోని కృష్ణవేణి స్కూల్ విద్యార్థులపై గురువారం ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. స్కూల్ సమీపంలో చెట్టుపై ఉన్న తేనెతుట్టెను కదిలించడంతో తేనెటీగలు పాఠశాల వైపు వచ్చి నలుగురు విద్యార్థులు, కరస్పాండెంట్‌పై దాడి చేసి తీవ్రంగా కుట్టాయి. దీంతో యాజమాన్యం  పాఠశాలకు సెలవు ప్రకటించింది.  గాయపడిన వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  
 
మరిన్ని వార్తలు