భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే: దేవేందర్

29 Nov, 2013 22:35 IST|Sakshi

రామాయంపేట: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా కార్యదర్శి పోలీస్ దేవేందర్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

హైదరాబాద్, భద్రాచలంపై సీమాంధ్రులకు ఎలాంటి హక్కులు ఉండవని తెలిపారు. సోదర భావంతో  విభజనకు సహకరించాలని కోరారు. ఆయనతో టీఎంవీఎస్ జిల్లా కన్వీనర్ కర్రె రమేశ్  ఉన్నారు.

మరిన్ని వార్తలు