పీఏసీ ఛైర్మన్గా భూమా నాగిరెడ్డి

5 Sep, 2014 11:56 IST|Sakshi
పీఏసీ ఛైర్మన్గా భూమా నాగిరెడ్డి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా పదవికి  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఎంపికయ్యారు. అలాగే పీయూసీ కాగిత వెంకట్రావు, ఎస్టిమేట్ కమిటీ ఛైర్మన్గా మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. లోక్‌సభ, శాసనసభల్లో పీఏసీ ఛైర్మన్‌ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సాంప్రదాయం. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఈ పదవి దక్కింది.  పీఏసీ ఛైర్మన్ పదవికి భూమా నాగిరెడ్డి నిన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు