ఏపీ పీఏసీ చైర్మన్గా భూమా నామినేషన్

3 Sep, 2014 16:16 IST|Sakshi
ఏపీ పీఏసీ చైర్మన్గా భూమా నామినేషన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

లోక్సభ, శాసనసభల్లో పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సంప్రదాయం. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పదవి దక్కింది. ఈ పదవికి భూమా నాగిరెడ్డిని ఎంపిక చేశారు.

>
మరిన్ని వార్తలు