హైదరాబాద్: కేసుల విషయమై వైఎస్ఆర్సీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో లాలూచి పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయనకు జగన్పై ఉన్న అక్కసుకు నిదర్శమని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రధాని మోదీని కించపరిచారని అన్నారు. బాబుకు మోదీ అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బాబు అవినీతిని చూసే మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. మూడేళ్లలో రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తికి మోదీ అపాయింట్మెంట్ ఎలా ఇస్తారని అన్నారు.
తనపై కేసులు పెట్టి జైలుకు పంపుతారనే బాబు ఇంకా ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్నారని చెప్పారు. ఈడీ అధికారులు ఉమాశంకర్ గౌడ్, గాంధీలతో బాబు సర్కారుకు ఉన్న సంబంధమేంటని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిగితే బాబు జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. బాబుకు దమ్ముంటే ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చే సాహసం మీరు చేస్తారా? అని ప్రశ్నించారు.