చంద్రబాబు పాపాలు పండాయి : భూమన

14 Dec, 2018 15:06 IST|Sakshi

సాక్షి, తిరుపతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాపాలు పండాయని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్క వాగ్దానాన్ని కుడా చంద్రబాబు నిలబెట్టుకొలేదని నిప్పులు చెరిగారు. భూమన సమక్షంలో కాంగ్రెస్ క్రీయాశీలక నేత చిన్ని నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి భూమన ఆహ్వానించారు. కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ కే బాబు. ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్ర, మైనారిటీ నేత ఖాధ్రీ, ఎంవీఎస్ మని, కుసుమ కుమారి, సాకమం ప్రభాకర్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్‌కు నీరాజనం పలుకు తున్నారని తెలిపారు. పాదయాత్రలో తండోప తండాలుగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. జగన్ సీఎం అయిన తరువాత ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు