అది తెలుగు వారందరికీ తీరని లోటు

31 Aug, 2019 18:35 IST|Sakshi

సాక్షి, తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు తమకే ​కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న తెలుగు వారందరికీ తీరని లోటేనని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మంది పేదల గుండెల్లో ఇప్పటికి వైఎస్సార్‌ కొలువై ఉన్నారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయి 10 సంవత్సరాలు అయ్యిందంటే నమ్మలేకపోతున్నామన్నారు. 2003లో విపరీతమైన ఎండలను కూడా లెక్క చేయకుండా తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తెప్పించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రిని మించిన పాలన అందిస్తున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు