అవినీతికి కేరాఫ్‌ చంద్రబాబు ప్రభుత్వం

20 Mar, 2018 18:22 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. చోడవరం వెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరత్నాలు కమిటీ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ.. విశ్వసనీయతకు, రాజకీయ నిబద్దతకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిలువెత్తు నిదర్శనం అన్నారు. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్‌ మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్‌, మాజీ మంత్రి సత్యారావు, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరదు కల్యాణితో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు