ఏసీబీలో విభజన కసరత్తు పూర్తి

6 Apr, 2014 01:37 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర అవినీతినిరోధకశాఖ(ఏసీబీ)లో  విభజన   కసరత్తును  ఆ శాఖాధిపతి    ఏకే ఖాన్ దాదాపుగా పూర్తి చేసినట్లు  తెలిసింది.  ముఖ్యంగా ఈ విభాగానికి  బంజారాహిల్స్‌లో  కొత్త భవానాన్ని గత సంవత్సరం  నిర్మించారు.  మొదట మోజంజాహి మార్కెట్ వద్ద  ఉన్న ఏసీబీ భవనాన్ని  సమాచార హక్కు కమిషనర్‌లకు  కేటాయించడంతో  కొత్త భవనంలోకి ఏసీబీ  హెడ్‌క్వార్టర్స్‌ను  మార్చారు.  సువిశాలమైన ఈ భవనంలో ఏసీబీ డెరైక్టర్ జనరల్‌తో పాటు డెరైక్టర్, అదనపుడెరైక్టర్లు, జాయింట్ డెరైక్టర్లు,  డీఎస్‌పీ,ఇన్‌స్పెక్టర్  ర్యాంకు అధికారులు మొత్తం 900 మంది  ఉన్నారు. వీరితోపాటు  ఒక వంద మంది వరకు  మినిస్టీరియల్ స్టాఫ్  ఉన్నారు.   ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులను  ఈ ప్రాంతానికి,  సీమాంధ్రకు చెందిన వారిని ఆ ప్రాంతానికి  దాదాపుగా  కేటాయించినట్లు సమాచారం.


 

మరిన్ని వార్తలు