విశాఖకు నేడు బిల్‌గేట్స్‌ రాక

17 Nov, 2017 02:24 IST|Sakshi

అగ్రి హ్యాకథాన్‌ సదస్సుకు హాజరు 

సాక్షి, విశాఖపట్నం: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ శుక్రవారం విశాఖపట్నానికి వస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఆయన ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. విశాఖపట్నం ఏపీఐఐసీ మైదానంలో జరుగుతున్న అగ్రిటెక్‌ సమ్మిట్‌ 2017 (అగ్రి హ్యాకథాన్‌) ముగింపు సదస్సులో బిల్‌గేట్స్‌ పాల్గొంటారు. భద్రతా కారణాల దృష్ట్యా బిల్‌గేట్స్‌ విశాఖలో గడిపే సమయంపై అధికారులు గోప్యతను పాటిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆయన ప్రస్తుతం లక్నోలో ఉన్నారు.

అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నానికి విశాఖకు చేరుకుంటారు. ఆయన వెంట భార్య మెలిండా గేట్స్‌ కూడా వస్తారని చెబుతున్నారు. విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్డులో ఉన్న ఒక హోటల్‌కు వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అగ్రిహ్యాకథాన్‌ సదస్సులో పాల్గొంటారు. సదస్సులో కీలకోపన్యాసం చేస్తారు. రైతులు, శాస్త్రవేత్తలతో ముచ్చటిస్తారు. అనంతరం విమానంలో తిరుగు పయనమవుతారు. బిల్‌గేట్స్‌ రాకను పురస్కరించుకుని విశాఖ నగరాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు.  

మరిన్ని వార్తలు