బిల్లులు ఇవ్వలేదు...

21 Nov, 2018 08:01 IST|Sakshi
జగన్‌ని కలిసిన బిత్తరపాడు గ్రామ మహిళలు

విజయనగరం :అన్నా మాది బిత్తరపాడు గ్రామం. మా గ్రామం తోటపల్లి బ్యారేజీలో పోయింది. మాకు వేరే చోట స్థలాలు ఇచ్చారు. మేం అక్కడ ఇల్లు కట్టుకోడానికి పునాదులు వేసుకున్నాం. ఐదు సంవత్సరాలవుతున్నా మాకు పునాదుల బిల్లులు కూడా రాలేదు. దీంతో మేం పాత గ్రామంలోనే ఉన్నాం. నీరు ఎక్కువైతే మా గ్రామం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉండడంతో భయాందోళనలకు గురవుతున్నాం. అధికారులకు చెబితే గ్రామం ఖాళీ చేసేమంటున్నారు. మాకు ఇల్లు నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోతే ఎక్కడకు పోతామన్నా. మీరు అధికారంలోకి రాగానే మమ్మల్ని ఆదుకోవాలన్నా...

మరిన్ని వార్తలు