హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటనతో తలెత్తిన సమస్యను పరిష్కరించుకునే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని బీజేపీ నేత ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలే వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. దీని వెనక కాంగ్రెస్ అధిష్టానం కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. కాగా టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ మాట్లాడుతూ విభజన ప్రకటన వెలువడిన తర్వాత కూడా సీమాంధ్ర నేతలు ఉద్యమాలకు దిగటం దారుణమన్నారు.