దుండగుల దాడిలో బీజేపీ నేతకు తీవ్ర గాయాలు

28 Jun, 2015 13:24 IST|Sakshi

కడప అర్బన్: కడప పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు బండి ప్రభాకర్‌రావుపై ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వివరాలు.. నగరంలోని రాజీవ్‌పార్క్ దగ్గర ఈ ఘటన జరిగింది. పార్క్ దగ్గర నుంచి బైక్‌పై ఇంటికి వెళ్లేందుకు ప్రభాకర్‌రావు సిద్ధమవుతున్న సమయంలో 20 మంది దుండగులు వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో ప్రభాకర్‌రావు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు