‘పడవ ప్రమాదం.. అక్కడి ఎమ్మెల్యేదే బాధ్యత’

15 Jul, 2018 18:41 IST|Sakshi
బీజేపీ నేత పురంధేశ్వరి

సాక్షి, తూర్పుగోదావరి : గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంపై కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి స్పందించారు. మలాపురంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వనం-మనం కార్యక్రమంలో పాల్గొనడం కారణంగానే పిల్లలు గల్లంతయ్యారని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి అక్కడి ఎమ్మెల్యే బాధ్యత వహించాలని ఆమె సూచించారు. పోలవరం బిల్లులు ఏవీ పెండింగ్‌ లేవు అని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేత పురంధేశ్వరి తెలిపారు.

కన్నీరే.. గోదారై..

మరిన్ని వార్తలు