టీటీడీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వద్దు

9 Aug, 2019 11:31 IST|Sakshi

బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి

సాక్షి, తిరుమల: టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని బీజేపీ నేత సు​బ్రహ్మణ్య స్వామి తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రసుత్తం టీటీడీ పాలనా నిర్వహణపై వాజ్యం నడుస్తుందని తెలిపారు. గతంలో ఆనంద నిలయం బంగారు తాపడాని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించి విజయం సాధించానని తెలిపారు. పాలకమండలి ఏర్పాటుతో రమణ దీక్షితులు వ్యవహరం కొలిక్కి వస్తుందన్నారు.

మరిన్ని వార్తలు