పడవ బోల్తా : ప్రయాణికులు సురక్షితం

26 Jan, 2016 08:57 IST|Sakshi

విజయవాడ : కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలోని ఉప్పుటేరులో మంగళవారం పడవ బోల్తా పడింది. పడవలో ప్రయాణిస్తున్న 50 మంది నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఉప్పుటేరులోని పడిన ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పల్లెపాడు నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని పాతపాడులో జరుగుతున్న సంతకు వీరు చేపల్ని తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు