జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా బొత్స 

5 Jul, 2019 06:39 IST|Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లాకు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి  

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  

సాక్షి, కర్నూలు :  జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా బొత్స సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో ఎంఎస్‌ నంబరు 9 జారీ చేశారు. పురపాలకశాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా నియమితులయ్యారు.  అదే విధంగా జిల్లాకు చెందిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమితులయ్యారు.   
 

>
మరిన్ని వార్తలు