ఓబులవారిపల్లె : సరదాకొద్దీ ఈతకెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెలకు చెందిన తరుణ్కుమార్ రెడ్డి అనే పదకొండేళ్ల బాలుడు గురువారం మధ్యాహ్నం సమీపంలోని సుద్దకుంటలో ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ చనిపోయాడు. బాలుడు ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్నాడు. బాలుడి శవాన్ని బయటికి తీసేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.