ఇసుక ధర తగ్గించాలని ధర్నా

12 Feb, 2015 11:24 IST|Sakshi

అనంతపురం: ఇసుక ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ సంఘం, పెయింటర్ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుంతకల్లులో గురువారం భారీ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా బీరప్ప గుడి సర్కిల్ నుంచి గాంధీ చౌక్ వరకు దాదాపు మూడు కిలో మీటర్లు  ర్యాలీ నిర్వహించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాకు అఖిలపక్షం మద్దతు తెలిపింది. ధర్నాలో వైఎస్సార్ సీపీ నాయకులు వై.సుధాకర్, రామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు ఉమారెడ్డి పాల్గొన్నారు.
(గుంతకల్లు)

మరిన్ని వార్తలు