విశాఖపట్నం: భీమిలి మండలం రాళ్లవలసలో దుర్గయ్య అనే రైతు ఇంట్లో గత అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. 15 తులాల బంగారంతోపాటు రెండు లక్షల నగదును దొంగలు అపహరించుకొని పోయారు. దాంతో బాధితులు సోమవారం ఉదయం భీమిలి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.