దోపిడీ దొంగల హల్ చల్

1 Aug, 2013 01:14 IST|Sakshi
వరంగల్: వరంగల్ నగరంలో దోపిడీ దొంగలు బుధవారం అర్ధరాత్రి హల్ చల్ సృష్టించారు. మెడికల్ ఏజెన్సీ దుకాణంలోకి వెళ్లి తండ్రీ కొడుకులను కత్తితో పొడిచి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.
ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే, స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి వారిద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జల్సాల కోసమే ఈ పని చేసినట్లు వారు పోలీసుల ముందు అంగీకరించారు. 
మరిన్ని వార్తలు