సామాన్యుడి కడుపు నిండే పాలన కావాలి:బీవీ రాఘవులు

27 Nov, 2014 16:49 IST|Sakshi
బీవీ రాఘవులు

భీమవరం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు ఉందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సీపీఎం స్వర్ణోత్సవాలలో ఆయన పాల్గొన్నారు.

మన రాష్ట్ర ప్రజలకు కావలసింది సింగపూర్, మలేషియా తరహా పాలన కాదని చెప్పారు. సామాన్యులు కడుపు నిండా తిండితినే పాలన కావాలని రాఘవులు అన్నారు.
**

మరిన్ని వార్తలు