'పుష్కరాల డబ్బు మేస్తే పాపం తగులుతుంది'

15 Jul, 2015 16:56 IST|Sakshi
'పుష్కరాల డబ్బు మేస్తే పాపం తగులుతుంది'

న్యూఢిల్లీ: గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం వేల కోట్లు ఖర్చుచేశామని టీడీపీ ప్రభుత్వం చెబుతున్న మాటల్లో ఏమాత్రం నిజంలేదని, క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుందని కాంగ్రెస్ పార్టీ నేత సి. రామచంద్రయ్య అన్నారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన పుష్కరాల కోసం కేటాయించిన నిధుల వినియోగంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

'ఒకవేళ టీడీపీ నేతలు గనక పుష్కరాల డబ్బును మేసిఉంటే వారికి తప్పకుండా పాపం తగులుతుంది' అని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. కేవలం కీర్త కోసమే చంద్రబాబు అంతాతానై వ్యవహరించాడని విమర్శించారు. సీఎం స్థాయిదాకాద ఎందుకు.. పుష్కరాల బాధ్యతను కలెక్టర్ కు అప్పగించిఉంటే సమర్థవంతంగా నిర్వహించేవారని ఎద్దేవాచేశారు.

మరిన్ని వార్తలు